సిరా న్యూస్, భీమదేవరపల్లి:
అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు సాగండి..
తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేప్యాల ప్రకాష్…
తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతరాజు లాలయ్య, రాష్ట్ర కమిటీ ఆదేశాలు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 గా జిల్లాలతో పాటు 119 నియోజకవర్గాలు, మండలాలలో కమిటీలు ఎన్నుకుంటున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేప్యాల ప్రకాష్ తెలిపారు. ఆదివారం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని రత్నగిరి గ్రామంలో మండల కన్వీనర్లు బొల్లంపల్లి రాజు, ఎల్తూరి ప్రేమ్ రాజు ఆధ్వర్యంలో గ్రామ కమిటీలు వేయడం జరుగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేప్యాల ప్రకాష్ ,రాష్ట్ర అధికార ప్రతినిధి తూముల సదానందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ మాట్లాడుతూ… భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ముందుకు పోవాలని అన్నారు. ఈరోజు అంబేద్కర్ లేకపోతే మనం ఇంత స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం ఉందేదికాదని, ఎస్సి, ఎస్టి, బీసీ, మైనార్టీ, ప్రజల కోసం భారత రాజ్యాంగాన్ని రాసి మనకు అందించిన ప్రపంచ మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. రత్నగిరి అంబేద్కర్ సంఘం నూతన గ్రామ కమిటీ అధ్యక్షులుగా చిట్టెంపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శిగా గడిపే పవన్, ఉపాధ్యక్షులుగా పారునందుల కుమారస్వామి, కార్యదర్శిగా గడిపే రవీందర్, ప్రచార కార్యదర్శిగా చిట్టెంపెల్లి అనిల్, సహాయ కార్యదర్శిగా కడారి రాజేష్, కోశాధికారిగా పారునందుల ఆనందం, కార్యవర్గ సభ్యులుగా గడిపే సంపత్, పాడేపు ప్రశాంత్, చిట్టెంపల్లి నరేష్, ఇల్లందుల అరుణ్, పారునందుల ప్రభాకర్, విష్ణు, గడపే బిక్షపతి, గౌరవ సలహాదారులుగా గడిపే ఆదాం, ఇల్లందు మధుకర్, చిట్టెంపల్లి చిరంజీవి కో కన్వీనర్ను గడప అరుణ్ కుమార్, ఆడెపు ప్రశాంత్ కార్యవర్గ సభ్యులు గా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు రేణికుంట్ల బిక్షపతి, అంబేద్కర్ సంఘం మాజీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి అశోక్, కో.కన్వినర్ కొమ్ముల రవీందర్, జేరిపోతుల ఐలయ్య, ఎం ఎస్ పి మండల అధ్యక్షులు పారినందుల సురేష్, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.