సిరా న్యూస్, కరీంనగర్:
అక్రమ ఇసుక తరలిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు..
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో అక్రమ ఇసుక తరలిస్తున్న ఇందూర్తి, రామంచ గ్రామాలకు చెందిన బురికి ప్రభాకర్, పల్లం నర్సయ్య, అనే ఇద్దరు వ్యక్తులపైన కేసులు నమోదు చేసినట్లు చిగురుమామిడి ఎస్ఐ బండి రాజేశ్ తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక ట్రాక్టర్లు నడిపినట్లైయితే వాల్టా చట్టం కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అక్రమ ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు.