అగ్నిప్రమాద బాధితులకు చేయుతనిచ్చిన ఎన్ఆర్ఐ జనసైనికులు

సిరా న్యూస్,అవనిగడ్డ;
ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడి వారిని ఆదుకోవడంలో జనసైనికులు ఎప్పుడూ ముందు ఉంటారని, ఇటీవల అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన వారిని ఆదుకోవడంలో జనసైనికులు చేసిన ఆర్ధిక సహాయం దానికి నిదర్శనంగా చెప్పవచ్చని మాజీ ఉపసభాపతి, జనసేన పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఇటీవల స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో కాల్చిన బాణసంచా వలన జరిగిన ప్రమాదంలో యాసం వెంకటేశ్వరరావు గృహం పూర్తిగా కాలిపోయిందని, వారిని ఆదుకోవడానికి ఎన్ఆర్ఐ జనసైనికులు పంపిన లక్ష రూపాయల చెక్కుని బుద్ధప్రసాద్ భాదితులకు అందచేశారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పూర్తితో జనసైనికులు ఇబ్బందులలో ఉన్న ప్రజలకు బాసటగా నిలుస్తున్నారని, నిత్యం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారని అన్నారు. అదే కోవలో తాము స్థానికంగా లేకపోయినప్పటికీ, అవనిగడ్డ లో ప్రమాద బాధితులను ఆదుకోవడానికి లక్ష రూపాయల నగదును పంపిన ఎన్ఆర్ఐ జనసైనికులకు బుద్ధప్రసాద్ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్ ఆర్ ఐ జనసేన ప్రతినిధులు పద్యాల శివరామ ప్రసాద్, మోహన కృష్ణ, సాధు మాధవ, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు, ఎన్నికల నిర్వహణ పార్లమెంటరీ కమిటీ సభ్యులు చిలకలపూడి పాపారావు, అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు, అవనిగడ్డ టౌన్ అధ్యక్షులు రాజనాల వీరబాబు, మోపిదేవి మండల అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు బాదార్ల లోలాక్షుడు, ఘంటసాల రాజమోహనరావు, శోభిల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు
===============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *