సిరా న్యూస్, ఖానాపూర్:
అనగారిన వర్గాల ఆశ జ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్…
ఖానాపూర్ మండలంలోని సుర్జపూర్ గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని విగ్రహనికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ రచయిత, అనగారిన వర్గాలలో సాంఘిక రాజకీయ నిత్య సమరసిలి, భారతరత్న బడుగు బలహీన ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, మండల అధ్యక్షులు దొనికేని దయనంద్, పార్టీ మండల జనరల్ సెక్రెటరీ షాబీర్ పాషా,పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ , బి . రాజేందర్ ,సుర్జపూర్ ఎంపీటీసీ జంగిలి శంకర్, మేడంపల్లి సర్పంచ్ గుగ్లవత్ రాజు, గ్రామ అధ్యకులు గాజుల శ్రీనివాస్, సోన్న మహేష్,వైస్ చైర్మన్ కావలిసంతోష్,మామడశ్రీనివాస్,నిరటిప్రవీణ్,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.