సిరా న్యూస్,శ్రీకాకుళం;
శ్రీకాకుళం జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఉత్తరద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు.ముందుగా ఉత్సవ మూర్తులను అశ్వవాహనం పై ఉంచి తిరువీధి నిర్వహించారు.మాడవీధుల్లో ఊరేగించిన అనంతరం ఉత్సవ మూర్తులను ఆలయ ఉత్తర మండపంలో ఉంచి భక్తులకు దర్శనం కల్పించారు..