కర్నూలు,(సిరా న్యూస్);
వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా జిల్లాలో 446 జంటలకు రూ.3.72 కోట్ల రూపాయలు లబ్ది చేకూరినట్లు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు.
గురువారం వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన కార్యక్రమాన్ని కర్నూలు ఎంపి డాక్టర్ సంజీవ్ కుమార్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, కర్నూలు నగర పాలక సంస్థ మేయర్ బి.వై.రామయ్య, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, డిసిఎంఎస్ చైర్మన్ శిరోమణి తదితరులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం ద్వారా జూలై నుండి సెప్టెంబర్ 2023 త్రైమాసికంలో నూతనంగా వివాహం చేసుకున్న మొత్తం 446 మంది లబ్ధిదారులు (బీసిలు – 167 (ఒక్కటే కులం – 159, కులాంతర వివాహం – 8) , విభిన్న ప్రతిభావంతులు – 4, మైనారిటీస్ – 83(ఒక్కటే కులం – 81, కులాంతర వివాహం – 2), ఎస్సీ – 184 (ఒక్కటే కులం – 183, కులాంతర వివాహం – 1), ఎస్టీ – 8 మంది లబ్ధి పొందారన్నారు.