సిరా న్యూస్ చిగురుమామిడి:
ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం..
జడ్పిటిసి గికురు రవీందర్..
ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామని జడ్పిటిసి గికురు రవీందర్ అన్నారు.ఆదివారం నాడు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవవ్ పేట గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల హామీల భాగంగా ఇచ్చిన ఆరు హామీలలో నాలుగు పూర్తి చేశామని. త్వరలోనే మరో రెండు హామీలను కూడా పూర్తి చేస్తామని అన్నారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ. 500 కే ఉచిత గ్యాస్ కనెక్షన్.200 యూనిట్ల ఉచిత కరెంటు అమలు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.ప్రజా పాలన దరఖాస్తులు లోపాలు జరిగి ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిమల్లె రవీందర్,అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు భారతీ దేవి, ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎంపిటిసి ఠాగూర్ సుష్మ ఠాగూర్,జిల్లా వికలాంగుల కన్వీనర్ కంది నాగరాజు,మండల ఉపాధ్యక్షుడు ఠాగూర్ నరేందర్ సింగ్ ,మండల మైనార్టీ సెల్ ఎండి షాబుద్దీన్,కిసాన్ సెల్ అధ్యక్షుడు కాంతాల మైపాల్ రెడ్డి,సోషల్ మీడియా మండల కన్వీనర్ బోయినీ వేణుగోపాల్,మండల యూత్ నాయకుడు గొట్టే రఘు బాబు ,వరుకోలు సంతోష్ ,మాజీ వార్డు సభ్యులుమాడ శ్రీనివాస్, గ్రామ ఉపాధ్యక్షుడు కోక్కిస శ్రీనివాస్,బీసీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షుడు పిల్లి కొమురయ్య,శాలివాహన అధ్యక్షుడు నాలాపూర్ మల్లేశం, ఎస్ ఇ సెల్ ఉపాధ్యక్షుడు కాశపాక సంపత్, గ్రామ శాఖ నాయకులు మాంకాల రవి, ఠాగూర్ దిలీప్ సింగ్, మట్టల లక్ష్మయ్య,గూళ్ల రాజు,బోయిని వంశీకృష్ణ,పిల్లి తిరుపతి,బోయిని రాజయ్య,బోయినీ ప్రశాంత్,మర్రి ఓదయ్య, సారయ్య,బుర్ర భద్రయ్య, మవుటమ్ రమేష్, బుర్ర రవి, కార్యకర్తలు పాల్గొన్నారు.