సిరా న్యూస్, గుడిహత్నూర్:
ఉదారత చాటుకున్న పవార్ రవి నాయక్…
– వృద్ధ దంపతులకు ఆర్థిక సహాయం అందజేత
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మాజీ సర్పంచ్ పవార్ రవి నాయక్ ఉదారత చాటుకున్నారు. మండలంలోని జవహర్ నగర్ కు చెందిన వృద్ధ దంపతులు మహమ్మద్ సాబ్, మజీద్ మోజనా గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న గుడిహత్నూర్ మాజీ సర్పంచ్, బిఆర్ఎస్ నాయకులు పవార్ రవి నాయక్ వారిని పరామర్శించి, తన వంతుగా రూ. 5 వేల ఆర్థిక సాయం అందించారు. అభాగ్యులైన వృద్ధులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు.