సిరా న్యూస్, ఇంద్రవెల్లి:
ఎమ్మెల్యే వెడ్మా బొజ్జును కలిసిన దళిత సంఘాల నాయకులు…
+ గణతంత్ర వేడుకలకు ఆహ్వానం అందజేత…
జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఇంద్రవెల్లి లో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు అవ్వాలని, అంబేద్కర్ మెమోరియల్ నాయకులు ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ను కోరారు. గురువారం ఈ మేరకు పలు దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి, ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… గణతంత్ర దినోత్సవ వేడుకలకు తప్పనిసరిగా హాజరవుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండల అధ్యక్షులు మనోహర్ సొంకాంబ్లే, నాయకులు కంరాజ్ వాగ్మరే, భీమ్ ఆర్మీ ఖానాపూర్ అధ్యక్షుడు సందీప్ పరత్వగ్, నాయకులు ఉత్తం సూర్యవంశీ, రాజవర్ధన్ మస్కె, జితేందర్ సొంకాంబ్లే సునిల్ కాంబ్లే, శివాజీ వావల్కర్, లక్ష్మణ్ కాంబ్లే, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముఖడే ఉత్తం, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు జహీర్ ఎండి,ఆకాష్ వాగ్మరే, తదితరులు పాల్గొన్నారు.