సిరా న్యూస్, బేల:
ఎస్పీని కలిసిన యువజన కాంగ్రెస్ నాయకులు..
ఆదిలాబాద్ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గౌస్ ఆలంను శనివారం జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీని పూల బొకే అందించి శాలువాతో సన్మానించారు. ఎస్పీని కలిసిన వారిలో యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి, బేల మండలం కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు ఘన్ శ్యాం, మాజీ సర్పంచ్ రూప్ రావు, నాయకులు అవినాష్, శంకర్, తదితరులు ఉన్నారు.