కనీస వేతనం రూ’ 26000 ఇవ్వాలి.. బృందావతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

సిరా,న్యూస్ విశాఖపట్నం

కనీస వేతనం రూ 26000 ఇవ్వాలి.. బృందావతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

కనీస వేతనం 26000 ఇవ్వాలని కోరుతూ పెందుర్తి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు అంగన్వాడి సిబ్బంది. ఈ సందర్భంగా బృందావతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాట్లాడుతూ:
ప్రభుత్వం చర్చల పేరు మీద కాలయాపన చేస్తుందని. గత ప్రభుత్వంలో 11500 ఉన్న జీతాలను ఇప్పటి వైసిపి ప్రభుత్వం 12500 ఇస్తుందని. తప్పుడు జీ వో లతో వేలకు వేలు జీతాలు ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారే కానీ గత ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు మాత్రమే అదనంగా వస్తుందని అన్నారు. 1 లక్ష 8 వేల మంది ధర్నాలో పాల్గొన్న అంగన్వాడీలపై పార్వతీపురం ఎమ్మెల్యే, బొబ్బిలి ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని. భేషర్తుగా క్షమాపణ చెప్పాలని అన్నారు. అంగన్వాడిలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి . కనీస వేతనం అమలు చేసేదాకా ఈ ధర్నాని విరమించబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో  దేవి జిల్లా ప్రధాన కార్యదర్శి ,అనిత ఏఐటిసి ప్రధాన కార్యదర్శి ,భవాని ప్రాజెక్ట్ అధ్యక్షురాలు తదితరులు  పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *