సిరా న్యూస్, బోథ్:
కన్నుల పండుగగా శ్రీ వేంకేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు..
పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్..
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పాల్ కోటి గ్రామంలో శ్రీ. వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గత తొమ్మిది సంవత్సరాలుగా గ్రామస్తులందరూ కలిసికట్టుగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.బోథ్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు..