కమణీయం రమణీయం సత్యదేవుని కల్యాణం.

సిరా న్యూస్, దండేపల్లి:

కమణీయం రమణీయం సత్యదేవుని కల్యాణం

కమణీయం రమణీయం సత్యదేవుని కల్యాణం అంగరంగ వైభవంగ జరిగింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గుట్టపై వెలసిన రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి కల్యాణం ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు.ఈనెల 18న ప్రారంభమైన శ్రీ సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.ఉమ్మడి రాష్ట్రంలోనే మరో అన్నవరం గా ప్రఖ్యాతి గాంచిన గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి కల్యాణం గోధూళిక ముహూర్తం లో బుధవారం సాయంత్రం 6గంటల 45 నిమిషాలకు వేదపండితులు స్వామివారి కల్యాణం జరిపించారు.అంగరంగ వైభవంగా జరిగిన స్వామి వారి కల్యాణానికి చూడడానికి భక్తులు తండోపతండాలుగా గూడెం గుట్ట కు చేరుకొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *