హైదరాబాద్, (సిరా న్యూస్);
అప్పుడెట్లుండే తెలంగాణ.. ఇప్పుడెట్లుంది తెలంగాణ”.. తెలంగాణలో ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి పదేపదే భారత రాష్ట్ర సమితి చేస్తున్న ప్రచారం ఇది. అన్ని రంగాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని.. విద్యుత్ ఉత్పత్తిలో, విద్యుత్ వాడకంలో దేశంలోనే ప్రథమ స్థానంలో కొనసాగుతోందని భారత రాష్ట్ర సమితి చెప్పుకుంటుంది. కరెంట్ కావాల్నా, కాంగ్రెస్ కావాలా అని కెసిఆర్ పదేపదే అంటున్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు తప్పవని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. నాటి చీకట్లు మళ్ళీ మనం చూడాలా అని హరీష్ రావు భయపెడుతున్నారు. కానీ నిజంగా తెలంగాణ ఆ స్థాయిలో విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని సాధించిందా? గులాబీ పార్టీ చెబుతున్నట్టు విద్యుత్ రంగంలో తిరుగులేని విజయాలను నమోదు చేసిందా? అంటే కాదు అనే సమాధానం వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అధారిటీ వెలువరించిన నివేదిక లో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.“తొమ్మిదిన్నర సంవత్సరాలలో తెలంగాణ విద్యుత్ స్థాపిత సామర్థ్యం 7770 మెగావాట్ల నుంచి 18 వేల మెగావాట్లకు పెరిగింది. ఇది దేశంలోనే రికార్డు” ఇదీ కేసీఆర్ నుంచి గల్లి లీడర్ వరకు చేసే ప్రచారం. వాస్తవంగా ఇందులో అనేక నిజాలను ప్రభుత్వం దాచిపెట్టింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అధారిటీ దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యుత్ స్థాపిత సామర్థ్యాలపై అక్టోబర్ 2023 నివేదికను ఇటీవల ప్రచురించిందిఏపీలో పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ థర్మల్ పవర్ స్టేషన్ నీడ మునగడం ఖాయం. ఇక నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం మొత్తం ఒక విద్యుత్ గ్రిడ్ లాగా మారిపోయింది. దీని ప్రకారం ఒక రాష్ట్రంలో ఎంత స్థాపిత సామర్థ్యం ఉందనే విషయం పెద్ద లెక్కలోకి రాదు. మనదేశంలో ఏ మూల నుంచైనా తక్కువ ధరకు విద్యుత్ కొనే అవకాశం ఉంది. అయితే దురదృష్టవశాత్తూ తెలంగాణ ప్రభుత్వం పూర్తిచేసిన భద్రాద్రి ప్రాజెక్ట్, భవిష్యత్తులో పూర్తయ్యే 4వేల మెగావాట్ల యాదాద్రి ప్రాజెక్టులు దేశంలోనే అత్యంత ఖరీదైన విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు. ఇదంతా చదివిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మెరుగైనట్టు కనిపిస్తోంది కదూ! మీకు అలాంటి సందేహం రావడంలో ఆశ్చర్యం లేదు. కానీ బహిరంగ మార్కెట్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనడం ద్వారా కొరతను అధిగమిస్తున్నది. తెలంగాణలో మాత్రమే కాదు 2015 తర్వాత దేశం మొత్తంలో విద్యుత్ సరఫరా పరిస్థితి మెరుగైంది. దీనికి కారణం గతంలో దేశవ్యాప్తంగా మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తి కావడమే.. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ బొగ్గు సరఫరా మెరుగవడం వల్లే దేశంలో 20 కి పైగా రాష్ట్రాలలో ప్రస్తుతానికి విద్యుత్ కోతలు లేవు. మిగతా రాష్ట్రాల్లో కూడా విద్యుత్ కోతలు నామమాత్రంగా ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో విద్యుత్ ను కొనగలిగే ఆర్థిక స్తోమత ఉండే రాష్ట్రాలకు పెద్దగా ఇబ్బంది ఉండదు. తెలంగాణ రాష్ట్రం స్థోమత లేకపోయినప్పటికీ విద్యుత్ సంస్థల ఆస్తులు పూర్తిగా తాకట్టు పెట్టి విద్యుత్ కొంటోంది.. ప్రభుత్వం రాయితీలు పూర్తిగా చెల్లించకపోవడంతో విద్యుత్ సంస్థలు 52 వేల కోట్ల నష్టాలతో ఆర్థికంగా దివాలా అంచున ఉన్నాయి.