సిరా న్యూస్, ఖానాపూర్:
కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ మైనారిటీ ఎన్నికల అబ్జర్వర్ గా షబ్బీర్ పాష..
నియమించిన ఏఐసీసీ మైనారిటీ శాఖ…
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కు ధన్యవాదాలు తెలిపిన షబ్బీర్ పాషా…
పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ మైనారిటీ శాఖ ఇంచార్జ్ గా కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ మండల ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు, న్యాయవాది షబ్బీర్ పాష ను నియమించినట్లు ఏఐసీసీ మైనారిటీ డిపార్ట్ మెంట్ ఛైర్మెన్ ఇమ్రాన్ ప్రతాప్, ఏఐసీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ తెలంగాణ మైనార్టీ ఇంచార్జ్ ఫర్హాన్ అజ్మీ ఏఐసీసీ నుంచి ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా షబ్బీర్ పాషా మాట్లాడుతూ..నా మీద నమ్మకంతో ఖానాపూర్ నియోజకవర్గ మైనారిటీ విభాగ బాధ్యతలు అప్పగించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మాబొజ్జు పటేల్ కు,నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ శాఖ అద్యక్షులు. ఖానాపూర్ నియోజకవర్గ సమన్యయకర్త సత్తు మల్లేష్ కు అదిలాబాద్ పార్లమెంట్ మైనార్టీ విభాగ ఇంచార్జ్ జూనైద్ మెమైన్ కు అలాగే ఎం.ఏ లతీఫ్ పార్లమెంటరీ కో ఇంచార్జి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మైనారిటీలను ఏకం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీ అదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్ధి ఆత్రం సుగుణక్క గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. నియోజకవర్గ మైనార్టీ శాఖ ఇన్చార్జి గా షబ్బీర్ పాషా నియామకం పట్ల మున్సిపల్ ఛైర్మెన్ రాజుర సత్యం తో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు డి.దయనంద్,మైనార్టీ మండల అధ్యక్షులు సలీం ఖాన్ తో పాటు షౌకత్ పాషా సయ్యద్ ఆయుబ్ తో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు.