మంథని,(సిరా న్యూస్);
దేశంలో అనేక ఏండ్లుపరిపాలన చేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీ బలహీనవర్గాలను మోసపూరిత వాగ్దానాలతో మభ్యపెట్టి మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని సమాజ్ వాద్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారం తిరుపతి యాదవ్ అన్నారు. గురువారం మంథని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజ్వాద్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింహద్రి సూచన మేరకు మంథనిలో బీసీ బిడ్డ బలహీనవర్గాలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధూకర్కు సమాజ్వాద్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ములాయంసింగ్ యాదవ్ పేద కుటుంబం నుంచి వచ్చి మూడు సార్లు ఉత్తప్రదేశ్కు ముఖ్యమంత్రిగా, రెండు పర్యాయాలు దేశ రక్షణ మంత్రిగా పనిచేశారని వివరించారు. తెలంగాణలో ఎక్కడా లేనివిధంగా బీపీ మండల విగ్రహాన్ని మంథని నడి ఒడ్డున ఏర్పాటు చేసిన ఘనత కేవలం బీసీ బిడ్డ పుట్ట మధుకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు దేశంలో కాంగ్రెస్ బీజేపీ చాలా కాలం అధికారంలో ఉన్నా బీసీలకు రాజ్యాధికారం అందించలేదన్నారు.
ఈనాడు ఓ పార్టీ అదికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అని, మరోసారి కులగణన చేపడుతామని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. అయితే బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రిని, కులగణన ఎందుకు సాధ్యం కావడం లేదని ఆయన ప్రశ్నించారు.