సిరా న్యూస్, సైదాపూర్:
కెసిఆర్ బహిరంగ సభను విజయవంతం చెయ్యండి..
మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్….
ఈనెల 12న కరీంనగర్ లో జరిగే కెసిఆర్ భారీ బహిరంగ సభకు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు కదిలి రావాలని నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ అన్నారు. ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగే భారీ బహిరంగ సభకు హుస్నాబాద్ నియోజకవర్గ నుండి అధిక సంఖ్యలో ప్రజలు,కార్యకర్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంట్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ గెలుపు కోసం అందరూ కృషి చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.