సిరా న్యూస్, గుడిహత్నూర్ :
పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ఎలమ్మ గూడ యువకుల అధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే, క్రీడాకారులతో మాట్లాడి పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… క్రీడలతోనే మానసిక, శారీరక దృఢత్వం సాధ్యమని ఆయన అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్క క్రీడాకారుడు ప్రశాంత వాతావరణంలో, క్రీడా స్ఫూర్తితో ఆటలాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో
బోథ్ నియోజకవర్గ నాయకులు,ఇచ్చోడ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.