సిరా న్యూస్, కరీంనగర్:
క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎస్సై రాజేష్..
కరీంనగర్ జిల్లా చిగురుమామి మండలంలోని నవాబ్ పేట్ గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను ఎస్సై బండి రాజేష్ గురువారం ప్రారంభించారు. బ్యాటింగ్, బౌలింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని. యువకులు జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. శాంతియుత వాతావరణంలో ఈ పోటీలను కొనసాగించాలని క్రీడాకారులను కోరారు. కార్యక్రమంలో సివిల్ కాంట్రాక్టర్ దేవసాని కిరణ్ కుమార్ రెడ్డి,ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి,ఠాగూర్ దిలీప్ సింగ్,కుతురు రంజిత్ రెడ్డి,వార్డు సభ్యులు మాడ శ్రీనివాస్,గూళ్ల రాజు, ఆర్గనైజర్స్ బుర్ర శ్రీనివాస్ గౌడ్ డాక్టర్ సప్త ఋషి,బత్తిని సురేందర్, బోయిని వేణుగోపాల్,ఠాగూర్ రానా ప్రతాప్ సింగ్, బోయిని సాగర్,ఎర్రోజు చారి,ఠాగూర్ తేజ సింగ్,తదితరులు పాల్గొన్నారు.