గ్రామాల్లో తాగు నీటి సమస్యలు లేకుండా చూడాలి..

సిరా న్యూస్, పెంబి:

గ్రామాల్లో తాగు నీటి సమస్యలు లేకుండా చూడాలి..

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్..

గ్రామీణ ప్రాంతాలలో తాగు నీరు సమస్యలు లేకుండా చూడాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో  సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ  సందర్బంగా మాట్లాడుతూ గ్రామాల్లో నీటి సమస్యలు లేకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చేలాగా చూడాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరూ సహాకరించాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి త్రీ ఫేజ్ కరెంట్ సౌకర్యం కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉపాధి పనులు  ద్వారా కూలిలకు పని కల్పించే విధంగా చూడాలని తెలిపారు. దొంతి వాగు సమస్యపై అధికారులతో మాట్లాడుతానని అన్నారు. అధికారులంతా సమన్వయంతో సక్రమంగా అభివృద్ధి పనులు చెయాలని అన్నారు. అనంతరం మండలంలోని వేణునగర్ గ్రామంలో గృహ జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదే విధంగా కొలం కమ్యూనిటీ సంఘ భవనము, రాముగూడా గ్రామంలో 5లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమాకాంత్, ఎంపీపీ కవిత గోవింద్, ఎంపీడీఓ రమాకాంత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు స్వప్నిల్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మన్,  వైస్ ఎంపీపీ గంగారెడ్డి, ఏ ఈ శ్రీనివాస్, తులాల శంకర్, భూమేష్, స్వామి, మహేందర్, ఆఫ్ ఆర్ ఓ రామకృష్ణరావ్, ఏ ఈ లు ఉదయ్, విష్ణు, శ్రీనివాస్, పశు వైద్యధికారి విజయ్,తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *