సిరా న్యూస్, బేల:
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం..
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఫజుల్లా ఖాన్..
బేల మండలంలోని జామ్ గూడా, కాప్సీ బి గ్రామాల్లో 6 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఫజుల్లా ఖాన్, కాంగ్రెస్ నాయకులతో కలిసి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఫజుల్లా ఖాన్ మాట్లాడుతూ.. మండలంలో దాదాపుగా రెండు కోట్ల రూపాయలతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరు చేయడం పట్ల జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క, ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.రాబోయే రోజుల్లో గ్రామాలు మరింతగా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకోస్తుందని తెలిపారు . ఇది ప్రజాప్రభుత్వం గత ఎన్నికలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేవిదంగా ముందుకు వెళ్తుందని అన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధి పేరు మీద కేవలం కాలయాపన చేశారు తప్ప అభివృద్ధి ఎక్కడ చేయలేదని పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో మండలానికి మరింతగా నిధులు మంజూరు చేసి గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మార్కెట్ చైర్మన్ వామన్ వాంఖడే,మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే,మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గుండావార్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చంద్రకాంత్, జాదవ్ విలాస్, గేడం ఉద్దవ్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.