సిరా న్యూస్, బేల:
ఘనంగా మర్సకోల రాంజీ గోండ్ వర్ధంతి
బేల మండల కేంద్రంలోని కొమరం భీం కాంప్లెక్స్ లో రాంజీ గోండ్ 167 వర్ధంతి ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని తొమ్మిది తెగల గిరిజనులు హాజరై ఆయన చిత్రపటానికి ఘన నివాళ్లు అర్పించారు.ఈ సందర్బంగా చంద్ పల్లి రాయి సెంటర్ సార్మేడీ కోరంగే సోనేరావ్ మాట్లాడుతూ.. జల్ జంగల్ జమీన్ కోసం బ్రిటిష్ ప్రభుత్వంతో విరోచితంగా పోరాటం చేయడం బ్రిటిష్ ప్రభుత్వాన్ని, సైన్యానికి ముప్పుతిప్పులు పెటడం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం లక్షల సైన్యం తో రాంజీ గోండ్ ను నిర్భందించి. నిర్మల్ నడి ఒడ్డున మరి చెట్టుకు రాంజీ గోండ్ తో సహా వేయి మందికి ఒకేసారి ఏప్రిల్ 9నా ఉరి తీయడం జరిగింది అని అన్నారు.భారత స్వాతంత్ర సంగ్రామంలో రాంజీ గోండ్ దక్షిణ భారత దేశం నుంచి మొట్ట మొదటి పోరాటం యోధుడుగా పేరు పొందిన మహా వీరుడు అని అన్నారు. గత సంవత్సరం ఇదే రోజునా కొందరు గిరిజనేతరులు మా రాంజీ గోండ్, కుంరం సూరు జెండాలను తొలగించారు అని. విరిపై గతంలోనే పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. కానీ ఒక సంవత్సరం పూర్తి అయినప్పటికీ ఇప్పుడు వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఒకవేళ ఈ కేసును త్వరగా పరిష్కరించాకపోతే మళ్ళీ ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొడప భీంరావ్ ప్రధాన కార్యదర్శి ఆడా శంకర్, ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సిడాం నందుకుమార్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు, ప్రాధాన కార్యదర్శి కోరేంగా జంగశావ్, కొలం సంఘం అధ్యక్షులు కొడప జంగు, నాయకులు,సంతోష్, రాము, గులాబ్,సేకు మారు దివాకర్, తదితరులు పాల్గొన్నారు.