ఘనంగా విగ్రహ ప్రతష్ఠాపన: హాజరు అయినా భూక్యా జాన్సన్ నాయక్

సిరా న్యూస్,ఇంద్రవెల్లి  

ఘనంగా విగ్రహ ప్రతష్ఠాపన: హాజరు అయినా భూక్యా జాన్సన్ నాయక్

ఖానాపూర్ నియోజకవర్గం ఇంద్రవెళ్లి మండలం ధనోర బి  గ్రామంలో నూతనంగా  నిర్మించిన శ్రీ మల్లన్న స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మల్లన్న స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని, కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *