కోరుట్ల,(సిరా న్యూస్);
కరీంనగర్ అంబెడ్కర్ స్టేడియంలో అల్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ (సిఎస్కేఐ) 2023 వారి ఆధ్వర్యంలో ఈ నెల 17,18,19 తేదీల్లో జాతీయ స్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. ఈ కరాటే పోటిల్లో కటాస్, కుమ్మితే విభాగాల్లో కోరుట్ల పట్టణానికి చెందిన లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు ఇందూరి హర్షిత్ (2వ తరగతి) వెండి, కాంస్య పతకాలు, కుందారపు భన్సీధర్ (5వ తరగతి) కాంస్య పతకాలను జాతీయ స్థాయిలో అందుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండంట్ తుమ్మనపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లలకు విద్యతో పాటు వారి మానసిక ఉల్లాసానికి, ఆత్మరక్షణకు కరాటే విద్య దోహదపడతాయని తెలిపారు.ఈ సందర్భంగా పతకాలు సాధించిన విద్యార్థులను, కోచ్ అల్లె రమేష్ లను సన్మానించారు. ఈ కార్యక్రమం లో స్కూల్ ప్రిన్సిపాల్ సిరికొండ గంగాధర్, తుమ్మనపల్లి మనోజ్ కుమార్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.