టి పి హెచ్ ఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక..

సిరా న్యూస్, ఆదిలాబాద్:

 టి పి హెచ్ ఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక..

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ భవన్ లో తెలంగాణ ప్రజా హక్కుల సాధన సమితి కమిటీ ఏర్పాటు చేసుకున్నాo అని సభ్యులు తెలిపారు. అధ్యక్షునిగా ఇజ్జగిరి నారాయణ, ఉపాధ్యక్షులుగా సంతోష్, సోనీ రావు, ప్రధాన కార్యదర్శిగా కినక సురేష్, కోశాధికారిగా దర్శనాల అశోకులు నియమించినట్లు కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఇజ్జగిరి నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కలిగిన వ్యక్తులతో టి పి హెచ్ ఎస్ ను స్థాపించామని. సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపై అలుపెరగని పోరాటం చేస్తామని. ప్రజలకు మౌలిక వసతులపై పోరాడుతామని. ఎన్నికల అనంతరం కమిటీ నిర్మాణం పై దృష్టి సారిస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *