ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి.

సిరా న్యూస్, చిగురుమామిడి:

ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి

ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్ పేట గ్రామంలో చోటుచేసుకుంది.చిగురుమామిడి ఎస్ఐ బండి రాజేష్ తెలిపినా వివరాల ప్రకారం నవాబ్ పేట గ్రామానికి చెందిన బొల్లి శ్రీనివాస్ (49) ఆదివారం రోజున సమారు సాయంత్రం  సమయంలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ నడుపుతూ హరితహరం మొక్కలకు నీళ్ళు పోస్తూ ప్రమాదవశాత్తు అదుపుతప్పి ట్రాక్టర్ కిందపడి చనిపోయినట్లు తెలిపారు.శ్రీనివాస్ వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్.అతని భార్య గతంలో చనిపోయింది.ఇద్దరు కుమారులున్నారు.గత రెండు నెలల నుంచి రోజువారి కూలి కింద గ్రామపంచాయతీ ట్రాక్టర్ నడుపుతూ హరితహారం మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు.ఈ క్రమంలోనే ప్రమాదం జరిగింది.సోమవారం కుటుంబానికి న్యాయం చేయాలని మృతదేహంతో బంధువులు ఆందోళన చేశారు.సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *