సిరా న్యూస్, బేల:
డిఆర్డిఓ సాయన్నకు శుభాకాంక్షలు తెలిపిన..
కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామరూపేశ్ రెడ్డి..
జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారిగా నూతనంగా నియమితులైన సాయన్నను యువజన కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.బుధవారం యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు డిఆర్డిఓ కార్యాలయంలో పుష్పగుచ్చం అందించి శాలువతో సత్కరించారు.గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ బేల మండల అధ్యక్షుడు గాన్ శ్యామ్,పోవర్ గ్రామ సర్పంచ్ ఆడే శంకర్,జామిని సర్పంచ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.