తిరుమల శ్రీవారిని దర్శించుకున్నమంత్రి ఆర్కే రోజా

సిరా న్యూస్;తిరుమల;

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా, ప్రముఖ గాయకుడు మనోకలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి మంత్రి రోజా దర్శించుకున్నారు.ఉదయం వీఐపీ విరామ సమయంలో మంత్రి రోజా శ్రీవారిని దర్శించుకున్నారు.ఆమెకు ఆలయ అధికారులు మహా ద్వారం వద్ద స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు.దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా,టిటిడి అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.
ఆలయం వెలుపల మంత్రి రోజా మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకోవడం వల్ల స్వామి వారి ఆశీస్సులతో ప్రజలకు మరింత సేవలందించే శక్తి స్వామి వారు నాకు ఇస్తారని మంత్రి రోజా తెలిపారు.రాష్ట్ర ప్రజలు బాగుండాలి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి ప్రజా సమస్యలు దూరమై అందరూ బాగుండాలని స్వామి వారిని ప్రార్థించానన్నారు.పార్టీ కార్యక్రమంలో, క్యాబినెట్ మీటింగ్లో మొదట్లోనే నేనుంటానని రెండుసార్లు నగిరి నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని 2024 లో కూడా 175 స్థానాలకు 175 స్థానాలు గెలుస్తామని మంత్రి రోజా తెలిపారు.చంద్రబాబు నాయుడు ఓటమి భయంతోనే రెండు స్థానాలలో పోటీ చేస్తానని సర్వేలు చేపించుకుంటున్నాడు.175 స్థానాలకు పోటీ చేసే ధైర్యం లేకుండానే వైయస్సార్సీపి అభ్యర్థులు అసంతృప్తితో ఉన్నారని చెడు ప్రచారం చేస్తున్నారని మంత్రి రోజా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *