సిరా న్యూస్,ఏలూరు;
ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తర ద్వారం గుండా చిన వెంకన్నను భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం గోవింద నామ స్మరణలతో మరుమోగింది. ఉచిత దర్శనం, రూ.100, రూ.200, రూ.500 టికెట్లకు ప్రత్యేక క్యూ లైన్లు, గోవింద స్వాములకు, గ్రామస్తులకు మరో ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసింది.