సిరా న్యూస్,సికింద్రాబాద్;
సికింద్రాబాద్ లో నకిలీ వైద్యులపై వైద్య మండలి మరొక్క సారి కొరడా జులిపించివది. శుక్రవారం రాత్రి వైద్య మండలి సభ్యురాలు డా. ప్రతిభ లక్ష్మీ ఆద్వర్యంలో ఆకస్మిక తనిఖీలు జరిపారు. అడ్డగుట్ట, తుకారాంగేట్, వెస్ట్ మారేడ్ పల్లిలో ఆకస్మిక తనిఖీలు. 10మంది నకిలీ వైద్యుల గుర్తించారు. ఒక్కో నకిలీ వైద్యుడు 20, 25, 30 ఏళ్లుగా వైద్యం అందిస్తున్న వైనం బయటపడింది. జిల్లా వైద్యాధికారికి నివేదిక పంపుతాం., త్వరలోనే చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు