నవ దంపతుల ఆత్మహత్య.

సత్యసాయి,(సిరా న్యూస్);
శ్రీ సత్య సాయి జిల్లా  రామగిరి మండలం గంగంపల్లిలో నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండు నెలల్లోనే తోటలో  ఉరి వేసుకొని నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. గంగంపల్లి గ్రామానికి చెందిన దాదా (30)అనే యువకుడు జోత్స్న (26) అని యువతి గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోక పోవడంతో రెండు నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. గ్రామ పెద్దల సమక్షంలో ఇరువు కుటుంబ సభ్యులు ఒప్పించి దాదా ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు ఇద్దరూ కలిసి తోటకు వెళ్ళొస్తామని అక్కడికి వెళ్లి ఒక చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వెళ్లిన వారు ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అంతలోనే ఇద్దరు చెట్టుకు వేలాడుతుండడం చూసి గ్రామస్తులకు తెలిపారు. నవ వధువుల ఆత్మహత్య చూసి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను మార్చురీ నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించికేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *