నిర్మల్ లో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ…

సిరా న్యూస్, నిర్మల్:

నిర్మల్ పట్టణ కేంద్రం లోని వైఎస్ఆర్ కాలనీ లో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా, ఇరు పార్టీల కార్యకర్తలు పోటా పోటీ నినాదాలు చేశారు. ఈ సందరభంగా తోపులాట చోటుచేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు రెచ్చిపోయి, ఒకరి పై ఒకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు.

దీంతో పోలీసులు రంగంలోకి దిగి, ఇరు పార్టీల కార్యకర్తలను అదుపు చేశారు. ప్రచారం చివరి రోజు కావడంతో, ఇరు పార్టీల నాయకులు రెచ్చిపోయారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *