పండుగ వాతావరణంలో ఆడుదాం ఆంధ్ర క్రీడలు జిల్లా కలెక్టర్

సిరా న్యూస్,తిరుపతి;
ఈ నెల 26 నుండి 47 రోజుల పాటు జిల్లాలో 691  గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో  ఆడుదాం ఆంద్ర పండుగ వాతవరణంలో నిర్వహించనున్నామని అందుకుతగ్గ ఏర్పాట్లు పూర్తియ్యాయని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి వివరించారు.
బుధవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి “ఆడుదాం ఆంధ్ర” కార్యక్రమంపై  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నిజిల్లాల కలెక్టర్లతో , ఎస్ పి లతో సచివాలయ స్థాయి వరకు తెలిసేలా సమీక్ష నిర్వహించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి , అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి వివరిస్తూ  జిల్లాలో “ఆడుదాం ఆంధ్ర” క్రీడలకు సంబంధించి 502 మైదానాల గుర్తింపు పూర్తిచేసి ప్రజాప్రతినిధులు , ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా ఏర్పాట్లుచేసామని , మొదటి రోజున అన్ని ప్రదేశాల్లో 2 కె రన్ నిర్వహించనున్నామని వివరించారు. జిల్ల్లాలో 13.5 లక్షలు మంది వీక్షించే విధంగా రిజిస్టర్ చేసుకున్నారని, క్రీడాకారులూ  పాల్గొనడానికి రిజిస్టర్ అయ్యారని వివరించారు. జిల్లాలకు క్రీడలకు సంబంధించిన స్పోర్ట్స్ కిట్స్ , టి షర్ట్స్ , మెటీరియల్, మెడల్స్ వంటివి జిల్లాకు అందాయని వివరించారు. క్రీడల నిర్వహణకు పి ఐ టి , పిడి లు ,స్పోర్ట్స్ సిబ్బంది 635 మందిని నియమించామని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడానికి టీమ్స్ ఏర్పాటు సిద్డంచేసామని సాంప్రదాయ క్రీడల ఆటవిడుపు ప్రారంభంమే లక్ష్యంగా ఉన్నామని ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ సమీక్షలో జిల్లా క్రీడా అభివృద్ది అధికారి సయ్యద్ సాహెబ్, డి ఎల్ డి ఓ లు సుశీలా దేవి, ఆది శేషా రెడ్డి , జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *