సిరా న్యూస్, సైదాపూర్:
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించబోతోంది.
గ్రామశాఖ అధ్యక్షులు మారుపాక తిరుపతి..
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు కదిలి వెళ్ళారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని వెన్నంపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మారుపాక తిరుపతి అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ పరకాల రమేష్, మాజీ సర్పంచ్ మొలుగూరి కొమురయ్య, మొలుగూరి ఐలయ్య, మొలుగూరి వెంకటయ్య, కనకం అజయ్, సంగాల మహేష్, మొలుగూరి అశోక్, డప్పు కుమార్, అందె రాము, అందె మచ్చగిరి, మారుపాక సుమన్, తదితరులు ఉన్నారు.