సిరా న్యూస్, ఆదిలాబాద్ :
పార్లమెంట్ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి .. సునీల్ భన్సాలీ
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పనిచేయాలని. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా అసెంబ్లీ ఎన్నికల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సునీల్ బన్సల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల సమీక్ష, జిల్లాలో గెలుపోటముల పై చర్చించారు. రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కార్యక్రమాలను గురించి చర్చించిన బన్సల్ ఉమ్మడి జిల్లా నేతలకు పార్లమెంట్ ఎన్నికల పై దిశా నిర్దేశనం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాయల శంకర్,ఎంపీ సోయం బాపురవ్, ఎమ్మెల్యే రామారావు పటేల్, పాల్వాయి హరీష్ బాబు, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, ఉమ్మడి జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.