ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
సిరా న్యూస్,బండి ఆత్మకూరు;
మండల పరిధిలోని సంతజుటూరు గ్రామంలో సోమవారం పిచ్చికుక్క చేసిన దాడిలో గ్రామానికి చెందిన తెలుగు వెంకట నాగ కృష్ణ అనే నాలుగు సంవత్సరాల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం తల్లిదండ్రులు హైదరాబాదుకు తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన వైసిపి నాయకులు దూదేకుల మౌలాలి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి దృష్టికి తీసుకెళ్లారు. మానవత్వంతో స్పందించిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి హైదరాబాద్ వైద్యాధికారులతో చరవాణిలో మాట్లాడి చిన్నారి బాలుడికి మెరుగైన వైద్య చికిత్సలు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా బీద కుటుంబానికి చెందిన వాడు కావడంతో వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.