సిరా న్యూస్, కరీంనగర్:
పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం…
-చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని గురువులకు ఘన సన్మానం
-ఒకే వేదికపై 29ఏండ్లకు కలుసుకున్న 80మంది విద్యార్థులు..

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1994-1995 బ్యాచ్ కు చెందిన దాదాపు 80మంది పూర్వ విద్యార్థులు ఆదివారం ఒకే వేదికపై కలుసుకున్నారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి చదువుకున్న అదే ప్రభుత్వ పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంద్భంగా అంతా ఒక చోటుకు చేరి, గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని రోజంతా సంతోషంగా గడిపారు. చిన్ననాడు చేసిన అల్లరి పనులు, గడచిన రోజులను, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు, కుటుంబ పరిస్థితులు, తదితర విషయాలను గురించి ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు. ఒక చోటుకు చేరి సంబరాలు జరుపుకోవడంతో పాఠశాలలో పండగ వాతావరణం నెలకొంది.