పేద ప్రజల మనిషి దివంగత శ్రీ పాదరావు

సింగల్ విండో చైర్మన్ బయ్యపు మనోహర్ రెడ్డి

సిరా న్యూస్,కమాన్ పూర్;
పేద ప్రజల మనిషి మాజీ స్పీకర్ దివంగత దుద్దిల్ల శ్రీపాదరావు అని కన్నాల సింగల్ విండో చైర్మన్ బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ పర్మినెంట్ కార్మికుల సంఘం అధ్యక్షుడు బయ్యపు మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ కేశవరం ఆవరణలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావు 25వ వర్ధంతి వేడుకలు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి ప్రదాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి అయిన శ్రీపాదరావు పేద ప్రజలకు అండగా ఉండి ఎన్నో సేవలు చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కెర శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ పర్శ వేని శ్రీనివాస్, దాడి మహేష్, పోతుల ప్రసాద్, సందవేణి రాములు, పుప్పాల రమేష్, ఎదునూరి నారాయణ, నగునూరి రమేష్, మేడగొని రమేష్, , జెసిబి శ్రీనివాస్, గుంపుల శంకర్, రాజారామ్, ఎండి రఫిక్, సతీష్, మెడి రమేష్, భరత్ మరియు అధిక సంఖ్యలో పర్మినెంట్ మరియు కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు…
========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *