ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

—కిష్టంపేట సర్పంచ్ సార్ల పద్మ రమేష్

సిరా న్యూస్,తాండూర్;
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని కిష్టంపేట్ గ్రామపంచాయితీలో ప్రారంభమైన ప్రజాపాలన ధరఖాస్తుల స్వీకరణను సర్పంచ్ సార్ల పద్మా రమేష్లు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా బడుగు బలహీన వర్గాల మహిళలకు ప్రతినెల 2500 రూపాయల ఆర్థిక సహాయం ,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ప్రతి ఏటా సంవత్సరానికి 15000 రూపాయలు ,వ్యవసాయ కూలీలకు ప్రతి సంవత్సరం 12 వేల రూపాయలు అందిస్తామని ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని అమరవీరుల కుటుంబాలకు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, గృహ జ్యోతి పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రతినెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ,చేయూత పథకం ద్వారా నెలకు 4000 రూపాయలు మరియు దివ్యాంగులకు 6000 రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని వారన్నారు. ప్రజా పాలన అప్లికేషన్లకు చివరి తేదీ అంటూ లేదని గ్రామసభలు అయిపోయిన తర్వాత స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వవచ్చని సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ దామయ్య, కోఆప్షన్ మెంబర్ సత్యనారాయణ,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎండీ ఈసా,సిరంగి శంకర్,
కామని శ్రీనివాస్,సాలిగామ మల్లేష్, మురళీ ధర్ రావు,కాంగ్రెస్ యువనాయకులు మైదం అనిల్,నవీన్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *