ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..

సిరా న్యూస్, బేల:

ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి...
యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి

మావల మండలం బట్టి సావర్గం శివారు ప్రాంతంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అక్రమంగా లే ఔట్ నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఆదిలాబాద్ కు వచ్చిన రైల్వే సహాయ జనరల్ మేనేజర్ ధనుంజయులు కు వినతిపత్రం అందించారు. అనంతరం అయన మాట్లాడుతూ… బట్టి సావర్గం గ్రామానికి ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 84/3లో 6.38 ఎకరాలు ఉండగా ఇందులోని 5 ఎకరాలు ఇతరుల పేరుపై ఉండగా, మరో 1.1ఎకరా భూమి అప్పటి ప్రభుత్వం రైల్వే శాఖకు కేటాయించిందని తెలిపారు. రైల్వే శాఖకు కేటాయించిన భూమిని రైల్వే అధికారులు పట్టించుకోక పోవడంతో అక్రమార్కులు కబ్జా చేసి అందులో లే ఔట్ నిర్మించి, ఫ్లాట్లను అమ్మకానికి పెట్టారని పేర్కొన్నారు. ఇలాంటి అక్రమ లే ఔట్ లో అమాయకులు ఫ్లాట్లు కొనుగోలు చేసి, లక్షల రూపాయలు నష్టపోతున్నారని అన్నారు. వెంటనే స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడాలని రైల్వే సహయ జనరల్ మేనేజర్ కోరారు. కాగా సానుకూలంగా స్పందించిన రైల్వే సహాయ మేనేజర్, వెంటనే ఎంక్వైరీ చేస్తానని హామీ ఇచ్చినట్లు సామ రూపేష్ రెడ్డి తెలిపారు. ఈ  కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మావల మండల అధ్యక్షుడు శేఖర్,బేల మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు విపిన్ టక్రే,బోక్రే శంకర్,ముత్యాల సురేష్ తదితరులు పల్లగొన్నరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *