ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి..

సిరా న్యూస్, చిగురుమామిడి:

ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి..

చిగురుమామిడి ఎస్ఐ బండి రాజేష్..

ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని చిగురుమామిడి ఎస్ఐ బండి రాజేష్ విజ్ఞప్తి చేశారు. 2024 లోక్ సభ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం మండల కేంద్రంలో కేంద్ర బాలగాలతో కవాతు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎన్నికల నియమావళికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరు బాధ్యతని.  స్వేచ్ఛాయుత  వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.నియమావళిని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా సమాజంలో మెలగాలని మద్యపానం సేవించి వాహనాలు నడపరాదని, డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్, ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలని అన్నారు.ప్రమాదాల్లో కుటుంబ పెద్దను కోల్పోతే వారి కుటుంబం మొత్తం రోడ్డున పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐఎఫ్ఎఫ్ కేంద్ర బలగాలు,స్తానిక పోలీసు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *