సిరా న్యూస్, కరీంనగర్:
బండి సంజయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..
కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పైడిపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఇందుర్తి గ్రామానికి బండి సంజయ్ రేపు వస్తున్నారని. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంకల్ప వికాసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం ఇందుర్తి నవాబ్ పేట గ్రామాల మధ్యలో నడుస్తున్న డబుల్ తారు రోడ్డు పనులు పరిశీలిస్తారని తెలిపారు. బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.