సిరా న్యూస్,కరీంనగర్:
బండి సంజయ్ కి బీసీల ఓట్లు అడిగే అర్హత లేదు..
బీసీ రిజర్వేషన్ బిల్లు బిజెపి ఎందుకు పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం లేదు చెప్పాలి…
కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి మూడు పక్క రెడ్డి వెలమ పార్టీలే..!
అణగారిన వర్గాల పార్టీ ధర్మ సమాజ్ పార్టీ…చెప్పుల గుర్తుకు ఓటు వేసి శ్రీకాంత్ ను గెలిపించండి
ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహరాజ్.
బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండి సంజయ్ కుమార్ కి, కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలకు 90 శాతం బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లు అడిగే అర్హత లేదని ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహరాజ్ విమర్శించారు. గురువారం ధర్మసమాజ్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి చిలువేరు శ్రీకాంత్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు.గీత చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు డప్పు చప్పులతో భారీ ర్యాలీ నిర్వహించారు.ఎంపీ అభ్యర్థితో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ అమలు గురించి అడగడం లేదని ప్రశ్నించారు.బిజెపికి పార్టీ బీసీ రిజర్వేషన్ ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు.దీనిపైన బండి సంజయ్ కుమార్ సమాధానం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు.50 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ అమలు గురించి ఎందుకు మాట్లాడడం లేదని అన్నారు.ఈ మూడు పార్టీలకు బీసీల ఓట్లు అడిగే అర్హత లేదని తెలిపారు.ఈ మూడు పార్టీలు పక్కా రెడ్డి వెలమ అగ్రకుల పార్టీలేనని అన్నారు.అణగారిన వర్గాల తరఫున చిలువేరు శ్రీకాంత్ ను కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా బరిలో నిలిపామని తెలిపారు.ధర్మసమాజ్ పార్టీ గుర్తు చెప్పుల గుర్తుకు ఓటు వేయాలని కోరారు.ధర్మసమాజ్ పార్టీ దేశంలో రాష్ట్రంలో పార్లమెంట్ లో ఆరోగ్య, విద్య, ఉపాధి, బిల్లుల, సాధన కోసం ఎన్నికల యుద్ధంలో నిలిచిందని తెలిపారు.90% అనగారిన వర్గాల ప్రజలు ధర్మసమాజ్ పార్టీకి మద్దతు తెలియజేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు జంగం సాధన, ప్రధాన కార్యదర్శి తాళ్ల నరేష్, పరమేశ్వరి, బోయిని సదన్, రాకేష్, శివ తదితరులు పాల్గొన్నారు.