బడ్డీ పోటీలో విజేతగా ఎమ్మిగనూరు గవర్నమెంట్ జూనియర్ గర్ల్స్ కాలెజ్

సిరా న్యూస్,ఎమ్మిగనూరు;
ఎమ్మిగనూరు లో
గత రెండు రోజులు గా  రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్ (RPSF)   రాయలసీమ యునైటెడ్ స్టూడెంట్ ఫెడరేషన్  (RUSF) ఆధ్వర్యంలో  కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఫైనల్ మ్యాచ్ సందర్బంగా ముఖ్య అతిధి గా ఎమ్ ఈ ఓ -2 మధుసూదన్ రాజు గారు పాల్గొని టాస్ వేసి క్రీడాకారులుని అభినందనలు తెలపడం జరిగింది,
అనంతరం వైష్ణవి జూనియర్ కాలేజీ వర్సెస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పోటీ పడగా ఇందులో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ 30 పాయింట్స్ తేడా తో విజయం సాధించారు. అనంతరం విద్యార్ధి సంఘం నాయకులు ఆఫ్రిది,రఘునాథ్ మాట్లాడతూ
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, అలాగేప్రతి సంవత్సరంవిద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్నివెలికి తీస్తామని వారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు నవీన్, మహేష్, చిన్న మనోహర్, పి ఈ టీ షాషా , లెక్చరర్స్ శ్రీనివాసులు, కృష్ణమూర్తి కాలేజీ విద్యార్ధినులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *