సిరా న్యూస్, చిగురుమామిడి:
బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేత..
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన మైలారపు సంపత్ (38) అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా,బుధవారం రోజున మృతుని చెల్లెలు మైలారపు సంతోష యొక్క పదవ తరగతి బ్యాచ్ (2003-2004 ) స్నేహితులు మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించి, యాబై కిలోల బియ్యం అందించి మానవత్వం చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో కొలకాని సంపత్, రమంచ గోపాల కృష్ణ , పిట్టల రాజేందర్ , దుద్దెల రాజు, రొంటల తిరుపతి తదితరులు ఉన్నారు.