బీఆర్ఎస్ మహిళా ప్రజా ప్రతినిధులపై కేసు నమోదు

సిరా న్యూస్,మేడ్చల్
లువురు బి అర్ ఎస్ ప్రజాప్రతినిధులపై శామీర్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 12వ తేదీన కేసు నమోదైతే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత మే నెల 23వ తేదీన శామీర్పేటలోని జిల్లాకలెక్టరేట్ లో తెలంగాణ ఆవిర్భవించి 10 ఏండ్లు పూర్తయిన సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అప్పటి మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రసంగిస్తుండగా తాను రైతు సమస్యలపై ప్రశ్నిస్తేమంత్రిఆగ్రహం వ్యక్తం చేశారని, అక్కడే ఉన్న పలువురు మహిళా ప్రజాప్రతినిధులు తనను బయటకు లాక్కెళ్లి, పరువుకు భంగం కలిగించారని ఘటకేసర్ మండలం అంకుషాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు. శోభాదామోదర్ రెడ్డి మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన కమిషన్ బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని శమిర్పెట్ పోలీసులు ఆదేశించింది.దీంతో షామీర్పేట్ ఎంపీపీఎల్లుబాయి, జడ్పిటిసి అనిత, జవహర్ నగర్ మేయర్ కావ్య మేడ్చల్ ఎంపీపీ రజిత రాజ మల్లారెడ్డి పై ఐపిసి 352 కింద షామీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *