బీ.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న…

సిరా న్యూస్, ఆదిలాబాద్:

బీ.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న…

ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చెయ్యండి…

మాజీ మంత్రి జోగురామన్న..

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో  స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ… ఈనెల 29 వ తేదీన సాయంత్రం బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో ఇఫ్తార్ విందు ఉందని తెలిపారు. 1500 మందికి పైగా విందులో పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు ఆచరించేందుకు తగు ఏర్పాట్లు చేశామని, అన్ని మసీదుల ఇమామ్ లు, సదర్లు కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరారు. మరోవైపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందని, ప్రధాన పోటీ బీ.ఆర్.ఎస్, బీజేపీ మధ్యనే ఉంటుందని అన్నారు. 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీల అమలులో ఘోరంగా విఫలమయిందని మండిపడ్డారు. పార్టీ నుండి కొంత మంది నేతలు వలస వెళ్తే ఎటువంటి నష్టం లేదని, ప్రజలంతా తమ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబి పార్టీ ఘన విజయం సాధించనుందని ధీమా వ్యక్తం చేశారు.సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, నాయకులు సాజిదోద్దీన్, యూనిస్ అక్బాని,రోకండ్ల రమేష్, అసిఫ్, సలీం పాషా,ఆన్సర్.హైమద్, అసిఫ్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *