సిరా న్యూస్, ఓదెల:
భక్తులతో కిటకిటలాడిన ఓదెల మల్లన్న ఆలయం..
పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లన్న స్వామీ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకొని జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు గుడి ముందర పట్నం వేసి, బోనాలు చెల్లించి మొక్కలు తీర్చుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో మల్లికార్జున స్వామి వారి దర్శనం కోసం తరలి రావడంతో, భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఈవో చలువ పందిల్లు, మంచినీటి సౌకర్యం కల్పించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కాగా గజ్జల ఆగులు, శివశక్తి పూనకాలతో భక్తులు భక్తి పారావశ్యం తో మునిగితేలారు.