సిరాన్యూస్, చిగురుమామిడి:
భారత దేశం సర్వమత సమ్మేళనం.. కూన సంపత్..
భారత దేశం సర్వమత సమ్మేళనం అని పాఠశాల కారప్సడెంట్ కూన సంపత్ అన్నారు. చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలోని ఆక్సఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయినా మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం. సర్వమత సమ్మేళనం అని. మనం అన్ని మతాలను గౌరవించాలని సూచించారు. అనంతరం పిల్లలు ఏసుక్రీస్తు జీవిత చరిత్రను నాటిక రూపంలో నృత్య రూపంలో చక్కటి ప్రదర్శన చేసి అందరిని అలరించారు. ఇదే పాఠశాలలో చదువుతున్న రాయంచ గ్రామానికి చెందిన ఏంజిల్, శారోన్ తల్లిదండ్రులు పిల్లలఅందరికీ స్వీట్ పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పిల్లలు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అప్పాల సమ్మయ్య, మంజుల,రూప, రమ్య, సమత, శైలజా , సన అఫ్రిన్, సంధ్య్ సావిత్రి మల్లిక్, స్వాగతిక. తదితరులు పాల్గొన్నారు.