మంథని మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల కల్పన కు కృషి చేస్తా

-మున్సిపల్ చైర్మన్ పెండ్రి రమ సురేష్ రెడ్డి

సిరా న్యూస్,మంథని;

మంథని మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని
మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్రి రమ సురేష్ రెడ్డి అన్నారు.
మంథని మున్సిపాలిటిలో వార్డు సందర్శనలో భాగంగా గురువారం మున్సిపల్ పరిధిలోని గంగాపురి లో మున్సిపల్ చైర్మన్ పెండ్రి రమ సురేష్ రెడ్డి పర్యటించారు.
గంగాపూరిలోని పలు వాడలలో తిరుగుతూ స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు వీధులలో డ్రైనేజీ వ్యవస్థలను దగ్గరుండి శుభ్రం చేయించారు.
తమ కాలనీలో రోడ్లు ఉన్నప్పటికి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా చెడిపోయిందని దీనివల్ల మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచి దుర్వాసన వస్తున్నాయని, దీనివల్ల దోమలు పెరిగి ఆసుపత్రి పాలైతున్నామని వారు వాపోయారు. అలాగే బోర్లు వున్న కూడా సరిగా పనిచేయడం లేదని స్థానిక ప్రజలు తెలిపారు. ప్రజల సమస్యలపై స్పందించిన మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ తమకున్న సమయం తక్కువ అయినప్పటికీ పూర్తిస్థాయిలో ప్రజల సమస్యల నిర్మూలన కృషి చేస్తానని అన్నారు. కొత్త డ్రైనేజీ ల నిర్మాణం చేపడతామని, బోర్ల కు మోటార్ల ను బిగించి ట్యాంకుల ద్వారా నల్లాలు ఏర్పాటుచేసి నీటి కొరత లేకుండా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కుర్ర లింగయ్య, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
==============================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *